విశాఖకు ఐటీ కంపెనీలు కష్టమే: ఐటీ మంత్రి లోకేశ్
- October 10, 2017
‘విశాఖపట్నంలో సోషల్ ఎకో సిస్టం లేదు.. డైరెక్ట్ ఫ్లైట్లు లేవు.. అంతర్జాతీయ ప్రమాణాలున్న స్కూళ్లూ లేవు.. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను వదిలి విశాఖ రావడానికి ఐటీ కంపెనీల వారు సిద్ధంగా లేరు’ అని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఆయన విశాఖలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో ఐటీ కంపెనీల స్థాపనకు ఎన్నో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగాల్లో స్థానిక కోటా కుదరదన్నారు. అలాంటి కోటా ఉంటే ఏ సంస్థలూ ముందుకు రావని చెప్పారు.
విశాఖలో 2014కి ముందు కేటాయించిన స్థలాల్లో కొన్ని ఐటీ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించలేదని, వాటిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎలక్ట్రానిక్స్ యూనిట్ల ఏర్పాటులో తిరుపతి క్లస్టర్పై ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారని, సెల్ఫోన్ల తయారీ క్లస్టర్గా తిరుపతి అభివృద్ధి చెందుతోందన్నారు. కాగా, విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగిన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ సదస్సు మంగళవారం ముగిసింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







