దుబాయ్ పాఠశాలలో అగ్నిప్రమాదం : 2,200 మంది విద్యార్థులను క్షేమంగా ఖాళీ చేయించారు
- October 12, 2017
దుబాయ్: దుబాయ్ లోని ఘర్హౌడ్ ప్రాంతంలోని అల్ ఖలీజ్ నేషనల్ స్కూల్లో ఒక ప్రాథమిక కళా తరగతి గదిలో గురువారం ( నేడు ) ఉదయం 11.50 గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పాఠశాలలో ఉన్న 2,200 మంది విద్యార్థులను ఖాళీ చేయించారు.. దుబాయ్ సివిల్ డిఫెన్స్ తెలిపిన వివరాల ప్రకారం, ఫైర్ ఇంజన్లు, అంబులెన్సులు ఐదు నిమిషాల వ్యవధిలో పాఠశాలకు చేరుకున్నాయి. అగ్నిమాపక నియంత్రణ జట్టు ఎగిసిపడుతున్న మంటలను మధ్యాహ్నం 12.20 గంటలకు ఆర్పివేయగలిగేరు. అధికారులు మరియు ప్రత్యక్ష సాక్షుల కధనం ప్రకారం , మొట్టమొదటి అంతస్తులో పైకప్పుకు సమీపంలో ఉన్న ఒక ఎయిర్ కండిషన్డ్ నుండి పొగను గమనించామని వారు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. , దుబాయ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ పరిస్థితిని నియంత్రించిందని, విద్యార్థులు మరియు టీచింగ్ అధ్యాపకులు వెంటనే ఆవరణ నుండి ఖాళీ చేయించారు మరియు వారివరకు ఎటువంటి గాయాలూ లేవని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







