చేప ఇగురు పులుసు
- October 12, 2017కావలసిన పదార్థాలు: చేపలు - ఒక కేజీ, చింతపండు -రెండు నిమ్మకాయలంత, ఉల్లిపాయలు - రెండు, పచ్చి మిరపకాయలు- 5, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు - ఒక స్పూన్, గరంమసాలా - అరస్పూన్, మిరపపొడి - ఒకస్పూన్, ఉప్పు -తగినంత, పెరుగు- రెండు స్పూన్లు, బెల్లం పొడి- అర స్పూన్, పసుపు- తగినంత, పోపు దినుసులు- కావలసినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం: ముందుగా చేపముక్కలను ఆవిరిపై ఉడికించుకోవాలి. తరువాత ముల్లు తీసివేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసుకోవాలి. అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయ-కొత్తిమీర పేస్టు, పసుపు వేసి కలుపుకోవాలి. అందులో చింతపండు పులుసు పోసి మిరపపొడి, పెరుగు, ఉప్పు వేసి కలియబెట్టాలి. చింతపండు పులుసు మరుగుతున్న సమయంలో చేప ముక్కలను వేసుకుని ఉడికించుకోవాలి. తరువాత గరంమసాలా, బెల్లం పొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకుని దింపుకోవాలి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ