జీలకర్ర నీటిని తాగండి.. జలుబును దూరం చేసుకోండి..
- October 12, 2017
రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు ఒక గ్లాసు జీలకర్ర కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఎందుకంటే జీలకర్రలో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియని ఉత్తేజపరుస్తాయి. డయాబెటిక్ పేషెంట్లు ఇలా తాగడం షుగర్ అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు బి.పి.ని కూడా అదుపు చేసే గుణాలు జీలకర్రకు ఉన్నాయంటున్నారు.
జీలకర్రలో ఐరన్, ఫైబర్లు అధికంగా ఉండటం వల్ల గర్భిణీ మహిళలు ఈ నీటిని తాగడం మంచిది. ఈ నీటిని సేవించడం ద్వారా రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. మూత్రపిండాలు ఎక్కువగా ప్రభావం చెందుతాయని అందువల్ల అనవసరమైన టాక్సిన్లు బయటకు పంపేందుకు సహాయపడుతుంది.
అలాగే జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారకాలను కలిగి ఉండటం ద్వారా జలుబు ఫ్లూలను కలుగచేసే కారకాలకు నశింపజేస్తుంది. ఒక కప్పు నీటిలో జీలకర్ర, అల్లం, తులసి ఆకులను కలుపుకొని మరిగించి వడిగట్టుకోవాలి. ఆపై తేనెను కలిపి తాగటం వలన జలుబు నుండి ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









