నా తరువాత సినిమా మహేష్ తో అంటున్న దర్శక ధీరుడు

- October 13, 2017 , by Maagulf
నా తరువాత సినిమా మహేష్ తో అంటున్న దర్శక ధీరుడు

బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో రుచి చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి..తన నెక్స్ట్ సినిమా ఏంటి..? ఎప్పుడు చేస్తాడు..? ఏ హీరోతో చేయబోతున్నాడు..? ఎలాంటి కథ తో వస్తున్నాడని సినిమా ప్రేక్షకులే కాదు అన్ని ఇండస్ట్రీల వారు ఆసక్తిగా కొన్ని నెలలుగా ఎదుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు తెరదించాడు రాజమౌళి.
తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా గురించి తెలిపారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తో తన నెక్స్ట్ సినిమా అని అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని మీడియా కు తెలిపాడు. 'నా తర్వాతి చిత్రంలో ఎవరు నటిస్తారు, దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. దానయ్య(నిర్మాత)తో సినిమాకు ఒప్పుకున్నా. అదే నా తర్వాతి చిత్రం' అని జక్కన్న చెప్పుకొచ్చాడు.
2019లో రాజమౌళి-మహేశ్‌ సినిమా సెట్స్ పైకి రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేశ్‌ కొరటాల శివ దర్శకత్వం లో 'భరత్‌ అనే నేను' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com