నా తరువాత సినిమా మహేష్ తో అంటున్న దర్శక ధీరుడు
- October 13, 2017
బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచానికి తెలుగు సినిమా సత్తా ఏంటో రుచి చూపించిన దర్శక ధీరుడు రాజమౌళి..తన నెక్స్ట్ సినిమా ఏంటి..? ఎప్పుడు చేస్తాడు..? ఏ హీరోతో చేయబోతున్నాడు..? ఎలాంటి కథ తో వస్తున్నాడని సినిమా ప్రేక్షకులే కాదు అన్ని ఇండస్ట్రీల వారు ఆసక్తిగా కొన్ని నెలలుగా ఎదుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు తెరదించాడు రాజమౌళి.
తాజాగా ఓ ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన తదుపరి సినిమా గురించి తెలిపారు. సూపర్స్టార్ మహేశ్బాబు తో తన నెక్స్ట్ సినిమా అని అధికారికంగా ప్రకటించాడు. ఈ మూవీ ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారని మీడియా కు తెలిపాడు. 'నా తర్వాతి చిత్రంలో ఎవరు నటిస్తారు, దాన్ని ఎన్ని భాషల్లో తెరకెక్కిస్తాం అనే విషయాల గురించి ఇంకా ఏమీ అనుకోలేదు. దానయ్య(నిర్మాత)తో సినిమాకు ఒప్పుకున్నా. అదే నా తర్వాతి చిత్రం' అని జక్కన్న చెప్పుకొచ్చాడు.
2019లో రాజమౌళి-మహేశ్ సినిమా సెట్స్ పైకి రాబోతుందని తెలుస్తుంది. ప్రస్తుతం మహేశ్ కొరటాల శివ దర్శకత్వం లో 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!







