దూకుడు దేశానికి దూరంగా ఉండాలని దుబాయి సంచలన నిర్ణయం
- October 13, 2017
దుబాయి : దూకుడు దేశానికి దూరంగా ఉండాలని దుబాయ్ నిర్ణయించుకొంది. ఈ మేరకు ఉత్తర కొరియా ప్రభుత్వానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఊహించని దెబ్బ కొట్టింది. ఉత్తర కొరియన్లకు ఇకపై వీసా సర్వీసులు అందించబోమని తేల్చిచెప్పింది. ఉత్తర కొరియాతో సంబంధాల విషయమై దుబాయి ప్రభుత్వం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియాకు తన రాయబారిని రద్దు చేసుకుంది. ఉత్తర కొరియా పౌరులకు వీసాలు, కంపెనీ వీసాలను ఇకపై ఇవ్వబోమని తెలిపింది. ఉత్తర కొరియా చేస్తున్న అణ్వాయుధ పరీక్షలకు వ్యతిరేకంగానే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దుబాయి ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ భద్రతను దృష్టిలో పెట్టకుని తమ వంతు బాధ్యతగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు దుబాయ్ తెలిపింది. ఈ నిర్ణయాన్ని తాము కూడా అనుసరిస్తున్నట్లు గల్ఫ్ దేశాలయిన కువైట్, ఖతర్ సైతం తేల్చిచెప్పాయి. ఇప్పటికే యూఏఈలో దాదాపు 1300 మంది ఉత్తర కొరియన్లు జీవనోపాధి పొందుతున్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







