కోలీవుడ్ హస్యనటుడు సంతానంకు ఊరట.!
- October 13, 2017
కోలీవుడ్ హస్యనటుడు సంతానంకు చెన్నై హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది. సంతానంకు, బిల్డింగ్ కాంట్రాక్టర్ షణ్ముగసుందరంనకు మధ్య ఆర్ధిక లావాదేవీల సమస్య కారణంగా గత సోమవారం వాగ్వాదం జరిగి అది కొట్టుకునే వరకూ దారి తీసింది. ఆ గొడవల్లో షణ్ముగంతో పాటు, అతని స్నేహితుడు, న్యాయవాది, బీజేపీ నాయకుడు ప్రేమానందన్ గాయాలపాలైన సంగతి విదితమే. దీంతో న్యాయవాది ప్రేమానందన్ స్థానిక వలసరవాక్కం పోలీస్స్టేషన్లో సంతానంపై హత్యా బెదిరింపుల కేసు నమోదు చేయడంతో అతను అజ్ఙాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే.
కాగా సంతానం ముందస్తు బెయిల్ కోరుతూ చెన్నై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ న్యాయమూర్తి ఆదిత్యన్ సమక్షంలో విచారణకు రాగా రెండు రోజులుగా వాయిదా వేస్తూ వచ్చారు. శుక్రవారం మరోసారి విచారణకు రాగా గాయాల పాలైన న్యాయవాది ప్రేమానందన్ ప్రభుత్వ ఆస్పత్తిలో చేరారా?లేదా? అన్న వివరాలను విచారించి కోర్టుకు అందించాల్సిందిగా వలసర వాక్కం పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ నటుడు సంతానంకు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే సంతానం రెండు వారాల పాటు రోజూ వలసరవాక్కం పోలీస్స్టేషన్లో క్రమం తప్పకుండా సంతకం చేయాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







