కార్గో నౌక మునక, 11మంది భారతీయులు గల్లంతు

- October 13, 2017 , by Maagulf
కార్గో నౌక మునక, 11మంది భారతీయులు గల్లంతు

ఫిలిప్పీన్స్‌లో టైఫూన్‌ ధాటికి సముద్రంలో ప్రయాణిస్తున్న కార్గో నౌక మునిగిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది భారతీయులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని జపనీస్‌ కోస్ట్‌గార్డ్‌ వెల్లడించింది. కార్గో నౌకలో 26 మంది భారతీయులు ఉన్నారు. టైఫూన్‌ కారణంగా సముద్రమంతా అల్లకల్లోలంగా మారడంతో నౌక మునిగిపోయింది. 26 మందిలో 15 భారతీయ సిబ్బందిని సురక్షితంగా కాపాడగలిగారు. మిగతా 11 మంది గల్లంతయ్యారు. రెండు పెట్రోల్‌ బోట్స్‌, మూడు విమానాల సహాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే.. టైఫూన్‌ కారణంగా వాతావరణ పరిస్థితులు సక్రమంగా లేకపోవడంతో గాలింపు చర్యలు కష్టమైనట్లు జపనీస్‌ కోస్ట్‌గార్డ్‌ ప్రతినిధి తెలిపారు. మునిగిపోయిన నౌక 33,205 టన్నుల బరువు ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com