వాతావరణ హెచ్చరిక.!

- October 15, 2017 , by Maagulf
వాతావరణ హెచ్చరిక.!

వాతావరణ హెచ్చరిక. మరో ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు విశాఖపట్నం వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలపడి రానున్న 24 గంటల్లో.. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమేపీ బలపడుతూ వాయుగుండంగా మారే ప్రమాదం ఉంది. ఆ వాయుగుండం వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 19 నాటికి ఉత్తర కోస్తాంధ్ర - ఒడిశాల మధ్య తీరాన్ని తాకుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. మరోవైపు రాయలసీమపై మరో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో రానున్న ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాయలసీమ జిల్లాలు, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో 5 రోజులంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com