ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం
- October 16, 2017
ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కార్యాలయంలోని రెండో అంతస్తులోని రూమ్ నెం. 242లో ఉదయం 3.35 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన పీఎంవో సిబ్బంది.. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. పీఎంవో వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
ఈ సందర్భంగా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గుర్ముఖ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తమకు మంగళవారం ఉదయం 3.35 గంటల సమయంలో.. పీఎంవోలో అగ్నిప్రమాదం జరిగినట్లు కంట్రోల్రూమ్కు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో హుటాహుటిన పీఎంవో వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. కంప్యూటర్ యూపీఎస్లో షార్ట్ సర్య్కూట్ సంభవించడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







