ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో అగ్నిప్రమాదం
- October 16, 2017ఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయంలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. కార్యాలయంలోని రెండో అంతస్తులోని రూమ్ నెం. 242లో ఉదయం 3.35 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన పీఎంవో సిబ్బంది.. తక్షణమే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించింది. పీఎంవో వద్దకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది.
ఈ సందర్భంగా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గుర్ముఖ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. తమకు మంగళవారం ఉదయం 3.35 గంటల సమయంలో.. పీఎంవోలో అగ్నిప్రమాదం జరిగినట్లు కంట్రోల్రూమ్కు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. దీంతో హుటాహుటిన పీఎంవో వద్దకు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేసిందని చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని స్పష్టం చేశారు. కంప్యూటర్ యూపీఎస్లో షార్ట్ సర్య్కూట్ సంభవించడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు ఫైర్ సిబ్బంది తెలిపింది.
తాజా వార్తలు
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం