వర్థమాన గాయని హర్షిత దహియా దారుణ హత్య
- October 18, 2017 హర్యానా గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురయ్యారు. పానిపట్లోని ఇస్రానాలో ఆమెపై దుండగులు కాల్పులు జరిపి, హత్య చేశారు. ఇస్రానాలో మంగళవారం ప్రదర్శన ఇచ్చిన అనంతరం తిరిగి ఢిల్లీలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆమె ఢిల్లీలోని నరేలాలో నివసిస్తున్నారు.
ఈ సంఘటనపై పోలీసు అధికారి ఒకరు విలేకర్లతో మాట్లాడుతూ హర్షిత ఇస్రానాలో ప్రదర్శన అనంతరం కారులో ఢిల్లీ వెళ్తూండగా నలుగురు దుండగులు దాడి చేశారని చెప్పారు. వీరు పానిపట్లోని చమ్రారా గ్రామం వద్ద మరొక కారులో వచ్చారని, ఆమె కారును ఓవర్టేక్ చేసి, కాల్పులు జరిపారని చెప్పారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. పానిపట్లోని ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని ఉంచినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్