వర్థమాన గాయని హర్షిత దహియా దారుణ హత్య

- October 18, 2017 , by Maagulf
వర్థమాన గాయని హర్షిత దహియా దారుణ హత్య

 హర్యానా గాయని హర్షిత దహియా (22) దారుణ హత్యకు గురయ్యారు. పానిపట్‌లోని ఇస్రానాలో ఆమెపై దుండగులు కాల్పులు జరిపి, హత్య చేశారు. ఇస్రానాలో మంగళవారం ప్రదర్శన ఇచ్చిన అనంతరం తిరిగి ఢిల్లీలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆమె ఢిల్లీలోని నరేలాలో నివసిస్తున్నారు. 
ఈ సంఘటనపై పోలీసు అధికారి ఒకరు విలేకర్లతో మాట్లాడుతూ హర్షిత ఇస్రానాలో ప్రదర్శన అనంతరం కారులో ఢిల్లీ వెళ్తూండగా నలుగురు దుండగులు దాడి చేశారని చెప్పారు. వీరు పానిపట్‌లోని చమ్రారా గ్రామం వద్ద మరొక కారులో వచ్చారని, ఆమె కారును ఓవర్‌టేక్ చేసి, కాల్పులు జరిపారని చెప్పారు. ఆమె అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. పానిపట్‌లోని ఆసుపత్రిలో ఆమె మృతదేహాన్ని ఉంచినట్లు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com