భారతీయ ముస్లింలకు అల్లాని తప్ప వేరే దేవుళ్లను ఆరాధిస్తే... మరో ఫత్వా జారీ!
- October 21, 2017
సోషల్ మీడియాలో ఫోటోలు పోస్టు చేయడాన్ని నిషేధిస్తూ ఇటీవల సంచలన ఫత్వా వెలువరించిన ముస్లిం సంస్థ దారుల్ ఉలూమ్... తాజాగా భారతీయ ముస్లింలకు మరో కొత్త ఫత్వా జారీ చేసింది. ముస్లిం పురుషులు, మహిళలు అల్లాని తప్ప మరే ఇతర దేవుళ్లను ఆరాధించరాదని స్పష్టం చేసింది. ''అల్లాని తప్ప ఎవరైనా ఇతర దేవుళ్లను ఆరాధిస్తే.. వాళ్లు ముస్లింలుగా ఉండబోరు..'' అని దారుల్ ఉలూమ్ దియోబంద్ పేర్కొంది. కొందరు ముస్లిం మహిళలు దీపావళి సందర్భంగా వారణాసిలో హారతి ఇచ్చిన నేపథ్యంలోనే... శనివారం సదరు ముస్లిం సంస్థ ఈ ఫత్వా జారీ చేయడం గమనార్హం.
కాగా ముస్లిం మహిళలు కనుబొమ్మలను పీకడం, ట్రిమ్మింగ్ చేసుకోవడం, మంచి షేప్ వచ్చేలా తీర్చిదిద్దుకోవడం పైనా ఈ నెల మొదట్లో దారుల్ ఉలూమ్ ఫత్వా జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. ముస్లిం మహిళలు కనుబొమ్మలు పీకడం, జుట్టు కత్తిరించుకోవడం సహా మొత్తం పది అంశాలు ఇస్లాంకి విరుద్ధమంటూ దారుల్ ఇఫ్తా వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







