24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని వాయుసేనకు అమెరికా ఆదేశాలు
- October 23, 2017
ఉ.కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పేరు వింటేనే అమెరికా కలవరపాటుకు గురవుతున్నది. సోవియట్ రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత, తొలిసారి వాయుసేనను నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది. అణ్వాయుధాలు అమర్చిన యుద్ధ విమానాలు రోజులో 24 గంటలూ జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది. దీనికి సంబంధించిన ఆదేశాలు అధికారికంగా జారీ కాలేదు కానీ, అణు బాంబుల్ని సుదూర తీరాలకు మోసుకెళ్లి ప్రయోగించగల 'బీ-52' యుద్ధ విమానాల్ని అమెరికా రక్షణ శాఖ సన్నద్ధం చేసింది. 24 గంటలూ సన్నద్ధంగా ఉండాలని అమెరికా రక్షణ శాఖ నిర్ణయించటం సర్వత్రా సంచలనం రేపింది. ఇలాంటి స్థితి ఏర్పడటం, 1991లో ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తర్వాత ఇదే తొలిసారి.
'డిఫెన్స్ వన్' వెల్లడించిన వివరాల ప్రకారం అణ్వాయుధాలతో కూడిన అమెరికా యుద్ధ విమానాలు అనుక్షణంగా సంసిద్ధంగా ఉంటాయి, ఆదేశాలు జారీ అయిన మరుక్షణం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాయి. ఉత్తర కొరియా అణ్వాయుధాలతో దూకుడు ప్రదర్శించడం, కిమ్ జోంగ్ ఉన్ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోరాట దృక్పథాన్ని చూపిస్తుండటం, రష్యా సాయుధ దళాల క్రియాశీలత వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఈ సన్నాహాలను ఏదైనా ప్రత్యేక కార్యక్రమం కోసం చేయడం లేదని, అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా వాయు సేన చీఫ్ ఆఫ్ స్టాఫ్ డేవిడ్ గోల్డ్ఫీన్ చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







