జీఎస్టీపై కేంద్రం ప్రభుత్వం మరో సంచలన ప్రకటన
- October 24, 2017
పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీ ఊరట కల్పించింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గానూ గడువులోగా జీఎస్టీ రిటర్నులు దాఖలు చేయని వారికి విధించిన జరిమానాను మాఫీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్నిఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ట్విటర్లో వెల్లడించారు. ''పన్ను చెల్లింపుదారులకు సులభంగా ఉండేలా ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు గానూ జీఎస్టీఆర్-3బీ ఫైలింగ్పై ఆలస్యపు రుసుమును మాఫీ చేశాం. చెల్లించిన లేట్ ఫీజులను పన్ను చెల్లింపుదారుల ఖాతాల్లో తిరిగి జమచేస్తాం..'' అని వెల్లడించారు.
వ్యాపారులు, జీఎస్టీ ఫైలింగ్ సిబ్బందికి ఇబ్బందులు లేకుండా... సజావుగా పన్నుచెల్లింపులు జరిగేందుకే కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. జీఎస్టీ అమల్లోకి తీసుకొచ్చిన మొదట్లో పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు తలెత్తిన సంగతి తెలిసిందే. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీఎస్టీ రిటర్నులు దాఖలు చేసేందుకు అక్టోబర్ 20 చివరితేదీ కాగా...
ఆ ఒక్కరోజు మధ్యాహ్నం సమయానికే 33 లక్షల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయి. గంటలకు 77 వేల సేల్స్ డేటా చొప్పున జీఎస్టీఎన్ పోర్టల్లో అప్లోడ్ అయినట్టు జీఎస్టీఎన్ నెట్వర్క్ చైర్మన్ అజయ్ భూషణ్ పాండే ఆరోజు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







