లండన్‌ చేరుకున్న ఏ.పి సీఎం

- October 24, 2017 , by Maagulf
లండన్‌ చేరుకున్న ఏ.పి సీఎం

అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బృందం లండన్‌ చేరుకుంది. యూఏఈలో మూడు రోజుల పర్యటనను ముగించుకొని చంద్రబాబు దుబాయ్‌ నుంచి లండన్‌కు చేరుకున్నారు. లండన్‌లో రవాణా వ్యవస్థను చంద్రబాబు పరిశీలించనున్నారు. అమరావతిలో నిర్మించే శాసనసభ, హైకోర్టు భవనాలకు సంబంధించి నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ రూపొందించిన తుది ఆకృతులను పరిశీలించనున్నారు. యూకే ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు, పెట్టుబడిదారులతో జరిగే సమావేశాల్లో పాల్గొననున్నారు. గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యాక్రమానికి హాజరై అవార్డును అందుకోనున్నారు. గురువారం రాత్రి లండన్‌ నుంచి బయలుదేరి చంద్రబాబు బృందం దిల్లీకి చేరుకుంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com