రోడ్డు ప్రమాదాల్ని చిత్రీకరిస్తే క్రిమినల్ చర్యలే
- October 24, 2017
మనామా: రోడ్డు ప్రమాదాల్ని కెమెరాల్లో బంధించడం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీ, బిల్లుని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బిల్లులో సంబంధిత నేరాలకు 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించేలా వీలు కల్పించారు. మీడియా ప్రతినిథులు, అలాగే ప్రమాదాలకు గురైనవారిని మినహాయించారిక్కడ. ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. ఆరు నెలలకు మించని జైలు శిక్ష, 500 బహ్రెయినీ దినార్స్కి మించని జరీమానాను ఈ కేసుల్లో విధించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రమాదాల్లో గాయపడ్డవారు లేదా, తమవారిని కోల్పోయినవారు పడే వేదన చాలా తీవ్రమైనదనీ, అలాంటి ఘటనల్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం మానవత్వం అనిపించుకోదనీ, ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకురావాల్సి వస్తోందని ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







