రోడ్డు ప్రమాదాల్ని చిత్రీకరిస్తే క్రిమినల్ చర్యలే
- October 24, 2017
మనామా: రోడ్డు ప్రమాదాల్ని కెమెరాల్లో బంధించడం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయి. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీ, బిల్లుని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ బిల్లులో సంబంధిత నేరాలకు 500 బహ్రెయినీ దినార్స్ జరీమానా విధించేలా వీలు కల్పించారు. మీడియా ప్రతినిథులు, అలాగే ప్రమాదాలకు గురైనవారిని మినహాయించారిక్కడ. ఫారిన్ ఎఫైర్స్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ ఈ బిల్లుకు మద్దతిచ్చాయి. ఆరు నెలలకు మించని జైలు శిక్ష, 500 బహ్రెయినీ దినార్స్కి మించని జరీమానాను ఈ కేసుల్లో విధించాలని బిల్లులో పేర్కొన్నారు. ప్రమాదాల్లో గాయపడ్డవారు లేదా, తమవారిని కోల్పోయినవారు పడే వేదన చాలా తీవ్రమైనదనీ, అలాంటి ఘటనల్ని చిత్రీకరించి సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం మానవత్వం అనిపించుకోదనీ, ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును తీసుకురావాల్సి వస్తోందని ఎంపీ మొహమ్మద్ అల్ మారిఫి చెప్పారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







