దుబాయ్లో ఎమిరేటీ కిడ్నాప్: ఇద్దరికి జైలు
- October 24, 2017
దుబాయ్: ఎమిరేటీ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 32, 38 ఏళ్ళ వయసున్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులు ఈ కిడ్నాప్ కేసులో దోషులుగా తేలారు. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఇద్దరు అన్నదమ్ములు, అల్ నహ్దాలోని బాధితుడి ఇంటికి వెళ్ళి, అతను బయటకొచ్చాక అతనిపై దాడికి దిగారు. 33 ఏళ్ళ బాధితుడు, ఎదురు తిరిగేందుకు ప్రయత్నించగా, కత్తితోనూ నిందితులు దాడికి దిగారు. దాడి అనంతరం బాధితుడి నుంచి మొబైల్ ఫోన్ని లాక్కున్నారనీ, కారు తాళాన్నీ దొంగిలించారని బాధితుడు పేర్కొన్నారు. ఆ కారులోనే తనను కట్టిపడేశారనీ, ఎలాగోలా తప్పించుకున్న తాను పోలీసులకు సమాచారం అందించానని బాధితుడు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడి నుంచి సమాచారం సేకరించిన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద వారిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







