దుబాయ్లో ఎమిరేటీ కిడ్నాప్: ఇద్దరికి జైలు
- October 24, 2017
దుబాయ్: ఎమిరేటీ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 32, 38 ఏళ్ళ వయసున్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులు ఈ కిడ్నాప్ కేసులో దోషులుగా తేలారు. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఇద్దరు అన్నదమ్ములు, అల్ నహ్దాలోని బాధితుడి ఇంటికి వెళ్ళి, అతను బయటకొచ్చాక అతనిపై దాడికి దిగారు. 33 ఏళ్ళ బాధితుడు, ఎదురు తిరిగేందుకు ప్రయత్నించగా, కత్తితోనూ నిందితులు దాడికి దిగారు. దాడి అనంతరం బాధితుడి నుంచి మొబైల్ ఫోన్ని లాక్కున్నారనీ, కారు తాళాన్నీ దొంగిలించారని బాధితుడు పేర్కొన్నారు. ఆ కారులోనే తనను కట్టిపడేశారనీ, ఎలాగోలా తప్పించుకున్న తాను పోలీసులకు సమాచారం అందించానని బాధితుడు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడి నుంచి సమాచారం సేకరించిన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద వారిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







