దుబాయ్లో ఎమిరేటీ కిడ్నాప్: ఇద్దరికి జైలు
- October 24, 2017
దుబాయ్: ఎమిరేటీ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 32, 38 ఏళ్ళ వయసున్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులు ఈ కిడ్నాప్ కేసులో దోషులుగా తేలారు. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఇద్దరు అన్నదమ్ములు, అల్ నహ్దాలోని బాధితుడి ఇంటికి వెళ్ళి, అతను బయటకొచ్చాక అతనిపై దాడికి దిగారు. 33 ఏళ్ళ బాధితుడు, ఎదురు తిరిగేందుకు ప్రయత్నించగా, కత్తితోనూ నిందితులు దాడికి దిగారు. దాడి అనంతరం బాధితుడి నుంచి మొబైల్ ఫోన్ని లాక్కున్నారనీ, కారు తాళాన్నీ దొంగిలించారని బాధితుడు పేర్కొన్నారు. ఆ కారులోనే తనను కట్టిపడేశారనీ, ఎలాగోలా తప్పించుకున్న తాను పోలీసులకు సమాచారం అందించానని బాధితుడు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడి నుంచి సమాచారం సేకరించిన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద వారిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









