దుబాయ్లో ఎమిరేటీ కిడ్నాప్: ఇద్దరికి జైలు
- October 24, 2017
దుబాయ్: ఎమిరేటీ వ్యక్తిని కిడ్నాప్ చేసి తీవ్రంగా గాయపర్చిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ళ జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. 32, 38 ఏళ్ళ వయసున్న ఇద్దరు పాకిస్తానీ వ్యక్తులు ఈ కిడ్నాప్ కేసులో దోషులుగా తేలారు. జైలు శిక్ష అనంతరం వీరిని డిపోర్ట్ చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఇద్దరు అన్నదమ్ములు, అల్ నహ్దాలోని బాధితుడి ఇంటికి వెళ్ళి, అతను బయటకొచ్చాక అతనిపై దాడికి దిగారు. 33 ఏళ్ళ బాధితుడు, ఎదురు తిరిగేందుకు ప్రయత్నించగా, కత్తితోనూ నిందితులు దాడికి దిగారు. దాడి అనంతరం బాధితుడి నుంచి మొబైల్ ఫోన్ని లాక్కున్నారనీ, కారు తాళాన్నీ దొంగిలించారని బాధితుడు పేర్కొన్నారు. ఆ కారులోనే తనను కట్టిపడేశారనీ, ఎలాగోలా తప్పించుకున్న తాను పోలీసులకు సమాచారం అందించానని బాధితుడు చెప్పారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితుడి నుంచి సమాచారం సేకరించిన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద వారిని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









