నవంబర్లో జుమైరా జూ మూసివేత
- October 26, 2017
50 ఏళ్ళుగా అందర్నీ ఆకట్టుకుంటోన్న దుబాయ్లోని జుమైరా జూ నవంబర్లో మూసివేయబడనుంది. దుబాయ్ సఫారీ ప్రాజెక్ట్ కోసం ఈ జూపార్క్ని మూసివేయనున్నారు. మిడిల్ ఈస్ట్లో తొలిసారిగా ప్రత్యేక హంగులతో సఫారీ పార్క్ ప్రాజెక్ట్ని చేపట్టబోతున్న కారణంగా ప్రస్తుతం ఉన్న జుమైరా పార్క్ని మూసివేయాల్సి వస్తోందని దుబాయ్ మునిసిపాలిటీ లీజర్ ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఖాలిద్ అల్ సువైది చెప్పారు. కొత్త ప్రాజెక్ట్ ప్రాంగణంలోకి ప్రస్తుతం జుమైరా జూలో ఉన్న జంతువుల్ని తరలించనున్నట్లు ఆయన వివరించారు. దుబాయ్ సఫారీ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అలాగే జుమైరా జూ మూసివేత సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నవంబర్ 5న ఏర్పాటు చేసి, ఆ కార్యక్రమంలో ఉద్యోగులందర్నీ సన్మానించనున్నట్లు వెల్లడించారు అల్ సువైది. జూ క్లోజింగ్ సెర్మానీకి ప్రజలందరూ ఆహ్వానితులేనని, ఎలాంటి ప్రవేశ రుసుమూ వారికి ఉండబోదని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









