ఉత్తర్ప్రదేశ్లో స్విస్ జంటపై దాడి.. స్పందించిన సుష్మా
- October 26, 2017
ఉత్తర్ప్రదేశ్లో గత ఆదివారం ఓ విదేశీ జంటపై జరిగిన దాడిపై కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్పందించారు. ఈ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలంటూ యూపీ ప్రభుత్వాన్ని కోరారు. 'దాడి గురించి నాకు ఇప్పుడే తెలిసింది. దీనిపై యూపీ ప్రభుత్వాన్ని నివేదిక అడిగాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత జంటను మా అధికారులు కలుస్తారు.' అని సుష్మాస్వరాజ్ ట్వీట్ చేశారు.
స్విట్జర్లాండ్కు చెందిన క్వెంటిన్ జెరెమీ క్లెర్క్ తన ప్రేయసి మ్యారీ డ్రోజ్తో కలిసి సెప్టెంబర్ 30న భారత్ పర్యటనకు వచ్చారు. గత ఆదివారం వారు యూపీలో ఫతేపూర్ సిక్రీ రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తుండగా.. కొందరు స్థానిక యువకులు దాడి చేశారు. వారిని వెంబడించి రాళ్లతో కొట్టారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో క్వెంటిన్, మ్యారీ గాయపడ్డారు.
బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి ఎందుకు చేశారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









