సయీద్ షాహిద్ నివాసంపై ఎన్ఐఏ మెరుపుదాడి

- October 26, 2017 , by Maagulf
సయీద్ షాహిద్ నివాసంపై ఎన్ఐఏ మెరుపుదాడి

ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌ అధినేత సయ్యద్‌ సలావుద్దీన్‌ కుమారుడు సయ్యద్‌ షాహిద్‌ యూసఫ్‌ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులు సోదాలు చేపట్టారు. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై గత మంగళవారం యూసఫ్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ చేపట్టిన ఎన్‌ఐఏ అధికారులు నేడు తనిఖీలు చేపట్టారు. బుద్గాం జిల్లాలోని సోయ్‌బుగ్‌ గ్రామంలోని యూసఫ్‌ నివాసంలో ఈ ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. 
యూసఫ్‌ ప్రస్తుతం జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వంలోని వ్యవసాయ విభాగంలో పనిచేస్తున్నాడు. 2011లోని కేసుకు సంబంధించి ఆయనకు సమన్లు అందడంతో గత మంగళవారం అతడు ఎన్‌ఐఏ ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా విచారించిన అధికారులు అతడిని అరెస్టు చేశారు. సయ్యద్‌ సలావుదీన్‌ ఆదేశాల మేరకు 2011-14 మధ్య గులామ్‌ మహ్మద్‌ భట్‌(ఇవే ఆరోపణలపై ప్రస్తుతం జైల్లో ఉన్నాడు).. యూసఫ్‌కు డబ్బులు బదిలీ చేసినట్లు తమ వద్ద సాక్ష్యాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ కేసులోతదుపరి విచారణ కోసం యూసఫ్‌ను ఏడు రోజుల కస్టడీకి తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com