హిమాచల్ ప్రదేశ్‌ని వణికించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు

- October 26, 2017 , by Maagulf
హిమాచల్ ప్రదేశ్‌ని వణికించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు

హిమాచల్ ప్రదేశ్‌లో ఇవాళ ఉదయం సంభవించిన భూ ప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. శుక్రవారం ఉదయం 8.07 సమయంలో మండి ప్రాంతం మొత్తం ప్రకంపనలకు గురయ్యింది. దీంతో జనాలు ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తినష్టంగానీ జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈనెల మొదట్లో ఇదే తీవ్రతతో హిమాచల్ ప్రదేశ్‌లోని చాంబా ప్రాంతంలో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 1905లో హిమాచాల్ ప్రదేశ్‌లో అతిపెద్ద భూకంపం చోటుచేసుకుంది. దీంతో కాంగ్రా లోయలో దాదాపు 20 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com