హిమాచల్ ప్రదేశ్ని వణికించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు
- October 26, 2017
హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఉదయం సంభవించిన భూ ప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. శుక్రవారం ఉదయం 8.07 సమయంలో మండి ప్రాంతం మొత్తం ప్రకంపనలకు గురయ్యింది. దీంతో జనాలు ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తినష్టంగానీ జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈనెల మొదట్లో ఇదే తీవ్రతతో హిమాచల్ ప్రదేశ్లోని చాంబా ప్రాంతంలో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 1905లో హిమాచాల్ ప్రదేశ్లో అతిపెద్ద భూకంపం చోటుచేసుకుంది. దీంతో కాంగ్రా లోయలో దాదాపు 20 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







