హిమాచల్ ప్రదేశ్ని వణికించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు
- October 26, 2017
హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఉదయం సంభవించిన భూ ప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. శుక్రవారం ఉదయం 8.07 సమయంలో మండి ప్రాంతం మొత్తం ప్రకంపనలకు గురయ్యింది. దీంతో జనాలు ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తినష్టంగానీ జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈనెల మొదట్లో ఇదే తీవ్రతతో హిమాచల్ ప్రదేశ్లోని చాంబా ప్రాంతంలో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 1905లో హిమాచాల్ ప్రదేశ్లో అతిపెద్ద భూకంపం చోటుచేసుకుంది. దీంతో కాంగ్రా లోయలో దాదాపు 20 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- Kuwait air defences intercept Iranian missile, drone attacks
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక







