హిమాచల్ ప్రదేశ్ని వణికించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 4.4గా నమోదు
- October 26, 2017హిమాచల్ ప్రదేశ్లో ఇవాళ ఉదయం సంభవించిన భూ ప్రకంపనలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. శుక్రవారం ఉదయం 8.07 సమయంలో మండి ప్రాంతం మొత్తం ప్రకంపనలకు గురయ్యింది. దీంతో జనాలు ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టంగానీ, ఆస్తినష్టంగానీ జరక్కపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈనెల మొదట్లో ఇదే తీవ్రతతో హిమాచల్ ప్రదేశ్లోని చాంబా ప్రాంతంలో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. 1905లో హిమాచాల్ ప్రదేశ్లో అతిపెద్ద భూకంపం చోటుచేసుకుంది. దీంతో కాంగ్రా లోయలో దాదాపు 20 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?