ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొద్ది సేపటికే సభలో గందరగోళం
- October 26, 2017
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే మొదలైన కొద్ది సేపటికే సభలో గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ అరెస్టులు ఆపాలని వాళ్లు నినాదాలు చేస్తున్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలంటూ బీజేపీ తీర్మానం ప్రవేశపెట్టింది.
ప్రస్తుతం ప్రశ్నోత్తారాల సమయం కొనసాగుతున్నందున తర్వాత వాయిదా తీర్మానం చేపడదామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి చెబుతున్నా సభ్యులు వినటం లేదు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలన్న వారి డిమాండ్ మధ్యే అధికార పక్ష నేతల ప్రసంగం కొనసాగుతోంది. అయితే కాస్త తగ్గినట్లు కనిపించిన వాళ్లు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించే సమయంలో మళ్లీ స్వరం పెంచటం విశేషం. సీఎం ప్రసంగం అనంతరం మైక్ అందుకున్న ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కాంగ్రెస్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ఆందోళన చేసే హక్కు ఉంది కానీ, ఇది పద్ధతి కాదన్నారు. సీఎం మాట్లాడుతున్నా వినకపోవటం బాధాకరమని అక్బరుద్దీన్ ఈ సందర్భంగా చెప్పారు.
ఇదిలా ఉండగా తెలంగాణ శాసన మండలి నుంచి కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేసింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







