దుబాయ్లో ప్రవాస భారతీయుల ప్రధమ స్థానం
- October 27, 2017
దుబాయ్ : భారతీయ ప్రవాసీయులు ఆస్తుల కొనుగోళ్లలో మొదటి స్థానంలో ఉన్నట్లు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన గణాంకాలలో తేలింది. 2016 జనవరి నుంచి జూన్ 2017 వరకూ భారతీయులు దుబాయ్లో రూ. 42 వేల కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టారు ఈ మొత్తం గత ఏడాది కంటే రూ. 12,000 కోట్లు అధికం. దుబాయ్లో భారతీయులు ఎక్కువగా అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తుండగా, మరికొందరు విల్లాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్ రియల్ ఎస్టేట్పై భారతీయులకున్న ముద్ర ఏపాటిదో దుబాయ్ ల్యాండ్ డిపార్ట్మెంట్ వెల్లడించిన గణాంకాలతో స్పష్టమవుతోంది. ముంబయి, పుణే, అహ్మదాబాద్కు చెందిన వారు ఎక్కువగా దుబాయ్ ఆస్తులపై ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో అత్యధికులు దుబాయ్లో అపార్ట్మెంట్, విల్లా కొనుగోలుకు రూ. 6.5 కోట్లు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నారు. ఎనిమిది శాతం మంది రూ. 65 లక్షల నుంచి రూ. 3.24 కోట్లలో ఆస్తి కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారని దుబాయ్ ప్రాపర్టీ షో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. ఇక 9 శాతం మంది భారతీయులు దుబాయ్లో కమర్షియల్ ప్రాపర్టీని, 6శాతం మంది స్థలాలను సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. దుబాయ్ ఇన్వెస్టర్లకు అందుబాటు ధరల్లో ప్రాపర్టీలను అందిస్తోందని, రూపాయి బలోపేతమవడం కూడా ప్రాపర్టీ మార్కెట్కు ఊతం ఇస్తోందని అధ్యయనం తేల్చింది.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







