నైపుణ్యంగల వికలాంగులను ప్రతిభావంతులైన ప్రజలుగా సిద్ధం చేస్తున్న సౌదీ మంత్రిత్వ శాఖ
- October 27, 2017
వికలాంగులకు అండగా నిలిచి వారిని ఆర్ధికంగా బలోపేతం చేస్తామని సౌదీ మంత్రిత్వ శాఖ భరోసా ఇస్తోంది. కార్మిక మార్కెట్ లో వికలాంగులకు నైపుణ్యంగల, ప్రతిభావంతులైన ప్రజలుగా సిద్ధం చేసేందుకు అల్-ఇరా సొసైటీతో సౌదీ మంత్రిత్వ శాఖ బుధవారం ఒప్పందంపై సంతకం చేసింది. ఈ సంతకాల కార్యక్రమం లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సోషల్ సెక్యూరిటీ సహాయ కార్యదర్శి ఇబ్రహీం అల్ షాబీ, అల్-ఇరా సొసైటీ బోర్డు ఛైర్మన్ అమర్ బౌకాస్ లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రి అలీ అల్-ఘఫీస్ సమక్షంలో సౌదీ రాజధాని రియాద్ లో సంతకం చేసింది. ఈ అవగాహన ఒప్పంద సమయంలో మంత్రిత్వ శాఖ. స్థానిక శ్రామికుల మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలు మరియు పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వివిధ వైకల్యాలతో బాధ పడుతున్న ప్రతిభావంతులైన వ్యక్తులను స్పాన్సర్ చేసి, వారికి శిక్షణ అందచేస్తారు. .ప్రైవేటులో వికలాంగులకు ప్రతిభావంతులైన వ్యక్తులను సమర్ధించే మంత్రిత్వ శాఖ యొక్క కార్యక్రమంలో ఈ ఒప్పందంలో అమలు చేయనున్నారు. వికలాంగులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించే విధానాలు, నిబంధనలు, విధానాలు మరియు అధికార యంత్రాంగాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగం అభివృద్ధి చెందుతుంది. మంత్రిత్వ శాఖ చట్టాలు మరియు శాసనాలు మరియు వైకల్యాలున్న వ్యక్తుల తరఫున వృత్తి భద్రతలను అమలు చేయడం ద్వారా వికలాంగులకు సమాన అవకాశాలను మరియు విస్తృతమైన ఉపాధిని ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తాజా వార్తలు
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..







