ఎసి రెస్టారెంట్లకు జిఎస్టిని తగ్గించాలని మంత్రుల బృందం నిర్ణయం
- October 29, 2017
కోటి రూపాయలు టర్నోవర్ దాటని తయారీదారులు, రెస్టారెంట్లకు జిఎస్టిని తగ్గించాలని మంత్రుల బృందం సూచించింది. కంపోజిషన్ పథకం కింద వీరికి ఒక్క శాతం పన్ను మాత్రమే విధించాలని సూచించింది. అస్సాం ఆర్థిక మంత్రి హైమంత బిస్వా శర్మ నేతృత్వంలోని మంత్రుల బృందం ఎసి, నాన్ ఎసి రెస్టారెంట్ల మధ్య జిఎస్టి వ్యత్యాసాన్ని తగ్గించాలని, కంపోజిషన్ పథకం పరిధి దాటిన రెస్టారెంట్లకు 12 శాతం పన్ను విధించాలని కూడా సూచించింది. గది అద్దె రూ.7,500 కంటే ఎక్కువ వున్న హోటళ్లకు 18 శాతం పన్ను విధించాలని తెలిపింది.
రూ. ఒక కోటి టర్నోవర్ దాటని తయారీదారులు, రెస్టారెంట్లు, వ్యాపారుల కోసం కంపోజిషన్ పథకాన్ని జిఎస్టి కౌన్సిల్ ప్రారంభించిన విషయం తెలిసిందే. గతంలో ఇది రూ. 75 లక్షల వరకూ వుండేది. ఈ నెల
1 నుంచి రూ. కోటికి పెంచారు. అలాగే అంతర్రాష్ట్ర, జాతీయ స్థాయిలో వ్యాపారం నిర్వహించేవారిని కూడా కంపోజిషన్ పథకానికి అనుమతించాలని మంత్రుల బృందం సూచించింది. ఈ పథకం కింద సుమారు 15 లక్షల వ్యాపారులను ఎంపిక చేశారు. సాధారణ పన్ను చెల్లింపుదారులు నెలవారీగా పన్నులు చెల్లించాలి, అయితే ఈ పథకంలో వున్న వ్యాపారులు మూడు నెలలకొసారి మాత్రమే పన్నులు చెల్లించాలి. జులై నుంచి అమల్లోకి వచ్చిన జిఎస్టిపై అనేక విమర్శలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







