సోమాలియాలో ఆత్మాహుతి దాడి 25కు చేరిన మృతులు

- October 29, 2017 , by Maagulf
సోమాలియాలో ఆత్మాహుతి దాడి 25కు చేరిన మృతులు

- జంట పేలుళ్లతో దద్దరిల్లిన హోటల్‌, 25కు చేరిన మృతులు 
శనివారం నాడు సోమాలియాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 25కు చేరినట్లు అధికారులు చెప్పారు. సోమాలియా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్దుల్లాహీ ఫార్మాజో అతిధిగా హాజరు కావల్సిన కార్య క్రమం ప్రారంభం కావటానికి కొద్ది ముందు ఒక ఆత్మా హుతి దళ సభ్యుడొకరు పేలుడు పదార్ధాలతో నిండ ిన కారుతో హోటల్‌లోకి దూసుకు వచ్చాడు. కొద్దిసేపటికే మరో కారుబాంబు పార్లమెంట్‌ పాత భవనం గేటు వద్ద పేలింది. ఈ రెండు దాడులకు తామే బాధ్యత వహిస్తు న్నట్లు సోమాలియాకు చెందిన ఉగ్రవాద సంస్థ అల్‌ షబా బ్‌ ప్రకటించింది. భారీ పేలుడు సామగ్రితో వున్న ముగ్గు రు అల్‌ షబాబ్‌ కార్యకర్తలు హోటల్‌లోకి ప్రవేశించారని, తరువాత వారిని భద్రతా దళాలు కాల్చిచంపాయని అల్‌షబాబ్‌ ఒక ప్రకటనలో వివరించింది. ఈ దాడిలో 25 మంది మరణించారని, మరో 30 మందికి పైగా గాయప డ్డారని పోలీసు అధికారులు చెప్పారు. దాడి జరిగిన సమయంలో హోటల్‌లో వున్న ప్రభుత్వ మంత్రితో సహా దాదాపు 30 మందిని పోలీసులు రక్షించినట్లు స్థానిక పోలీసులు వివరించారు. ఈ సమయంలో పోలీసులు, ఉగ్రవాదులకు మధ్య హోరాహోరీ కాల్పులు జరిగాయనారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com