సౌదీ ప్రభుత్వం అక్కడి మహిళలకు మరో గుడ్న్యూస్
- October 30, 2017
సౌదీ మహిళలకు మరో గుడ్న్యూస్ చెప్పింది అక్కడి ప్రభుత్వం. ఇటీవలే సౌదీ మహిళలు డ్రైవింగ్ చేయొచ్చని పేర్కొన్న ప్రభుత్వం, తాజాగా మహిళలను స్పోర్ట్స్ స్టేడియాల్లోకి అనుమతించనున్నట్టు కీలక నిర్ణయం ప్రకటించింది. మూడు ప్రధాన స్టేడియాల్లోకి వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మహిళలను అనుమతించనున్నట్టు ఆ దేశ స్పోర్ట్స్ గవర్నింగ్ బాడీ జనరల్ స్పోర్ట్ అథారిటీ తెలిపింది. రియాద్, జెద్దా, దమన్ స్టేడియాల్లోకి మహిళలు కూడా వచ్చి మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని, దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది. అయితే వీరు కూర్చునేందుకు సీటింగ్ సౌకర్యం ఎలా ఉండబోతుందో ఇంకా తెలుపలేదు.
మహిళలను, పురుషులను అనుమతించే ప్రాంతాల్లో సౌదీలో ఇరువురిని వేరువేరుగా కూర్చోబెడతారు. సౌదీలో మహిళలకు ఎన్నో కఠినమైన ఆంక్షలు ఉంటాయి. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ దేశంలో మహిళలకు నిబంధనలు ఉంటాయి. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ మహిళలపై ఎప్పటి నుంచో కొనసాగుతున్న వివక్షను ఇటీవల కాలంలో తగ్గిస్తు వెళ్తున్నారు. మహిళలకు, పురుషులకు సమాన హక్కులు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇకపై మహిళలు స్టేడియంలోకి వచ్చి మ్యాచ్లు వీక్షించొచ్చని ప్రకటించారు. వర్క్ఫోర్స్లో కూడా మహిళల చేయూతను 22 శాతం నుంచి 30 శాతానికి పెంచాలనుకుంటున్నట్టు కూడా అక్కడి ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







