బార్సిలోనాలోని రైల్వే స్టేషన్‌లో 50 ఏళ్ల ఓ మహిళ 'ఓం' అంటూ గాయత్రీ మంత్రం

- October 30, 2017 , by Maagulf
బార్సిలోనాలోని రైల్వే స్టేషన్‌లో 50 ఏళ్ల ఓ మహిళ 'ఓం' అంటూ గాయత్రీ మంత్రం

హిందువులు పరమ పవిత్రంగా జపించే గాయత్రీ మంత్రం అక్కడి వారిని మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. గాయత్రీ మంత్రంలోని ప్రతీ అక్షరం బీజాక్షరమని, మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన.  మరి అంతటి మహిమగల మంత్రాన్ని స్పెయిన్‌లోని అతిపెద్ద నగరం బార్సిలోనాలోని రైల్వే స్టేషన్‌లో 50 ఏళ్ల ఓ మహిళ 'ఓం' అంటూ గాయత్రీ మంత్రాన్ని లయబద్దంగా ఆలపిస్తుంటారు.  ఇక్కడి మెట్రో రైల్వే స్టేషన్‌లో ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్‌కి వెళ్ళడానికి‌ అండర్ గ్రౌండ్ పాస్ ఉంది. ఆ అండర్ గ్రౌండ్‌లోనే ఈమె కూర్చుని భక్తితో ఆలపించే గాయత్రీ మంత్రాన్ని అటుగా వెళ్లే ప్రయాణీకులు విని ఆనందిస్తూ ఆమెకు సవినయంగా నమస్కరిస్తుంటారు. కొందరు ఆమెతో పాటు ఆలపిస్తూ వెళుతుంటారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యి కోట్లమంది అభిమానులను చూరగొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com