నవంబరు 7 నుంచి 10వతేదీ వరకు 300 విమాన సర్వీసులను రద్దు చేసిన ఢిల్లీ విమానాశ్రయం
- October 31, 2017
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ప్రయాణికులకు ముఖ్యమైన గమనిక అంటూ ఓ ప్రకటన చేశారు. వచ్చే నెల (నవంబరు) 7 నుంచి మూడురోజుల పాటు ఢిల్లీ విమానాశ్రయంలోని మూడు రన్ వేలకు మరమ్మతులు చేపడుతున్నందున 30 శాతం విమానసర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు చెప్పారు. సాధారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో గంటకు 67 విమానాలు వచ్చిపోతుంటాయి. కాని మూడు రన్ వేలకు మరమ్మతులు చేపడుతున్నందు వల్ల గంటకు వచ్చి పోయే విమానాల సంఖ్యను 45కు తగ్గించామని అధికారులు పేర్కొన్నారు. నవంబరు 7 నుంచి 10వతేదీ వరకు దాదాపు 300 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని ఢిల్లీకి వచ్చి పోయే విమాన ప్రయాణికులు గమనించాలని విమానాశ్రయ అధికారులు కోరారు. విమానాశ్రయంలో మరమ్మతు పనుల వల్ల కొన్ని విమాన సర్వీసులను రద్దు చేశామని ఇండిగో, స్పైస్ జెట్ ఎయిర్ వేస్ లు ఇప్పటికే ప్రకటించాయి.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!