దుబాయ్ డ్యూటీ ఫ్రీ రఫాల్ విజేతలు వీళ్ళే
- October 31, 2017తాజా దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్ డ్రా విజేతల్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ డ్రాలో ఇద్దరు విజేతలు చెరో 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఇందులో జపాన్కి చెందిన 47 ఏళ్ళ యజునోబు యమద 255 సిరీస్లో 2024 టిక్కెట్ ద్వారా 1 మిలియన్ డాలర్లను గెల్చుకున్నారు. ఈ బహుమతి గెల్చుకున్న రెండో జపనీయుడు కావడం గమనించదగ్గ విషయం. ఇది తనకు దుబాయ్లో రెండో ట్రిప్ అనీ, ఈ రెండో ట్రిప్ తనను ఇంతటి ధనవంతుడ్ని చేస్తుందనుకోలేదని యమద చెప్పారు. మరో లక్కీ విన్నర్ దుబాయ్లోని భారతీయుడు సంతోష్ విజయన్. 50 ఏళ్ళ సంతోష్ విజయన్ కూడా 1 మిలియన్ డాలర్లు గెల్చుకున్నారు. దుబాయ్లో 27 ఏళ్ళుగా నివసిస్తున్న సంతోష్ విజయన్, అబుదాబీలోని ఓ సంస్థలో ఆపరేషన్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు పిల్లలకు తండ్రి. నవంబర్ 11న తాను 51వ పుట్టినరోజు జరుపుకోనున్నాననీ, ఇది తనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటానని విజయన్ చెప్పారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..