విజయనగరం జిల్లా చీపురుపల్లి బీసీ హాస్ట్ల్ విద్యార్థులకు మద్యం తాగించిన హాస్టల్ సిబ్బంది
- November 01, 2017
విద్యా బుద్ధుల నేర్పి... పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన హాస్టల్ సిబ్బంది దారి తప్పుతున్నారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా అర్థంకాక అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి బీసీ హాస్ట్ల్ వార్డెన్లో 10వ తరగతి వరకు విద్యార్థులు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం వార్డెన్ హాస్టల్లో లేకపోవడంతో... అక్కడ పనిచేసే సిబ్బంది ఫుల్లుగా మందు కొట్టారు. అలాగే హాస్టల్కు వచ్చారు. మళ్లీ మరోసారి తాగారు.
తాగిన మైకంలో మిగిలిన లిక్కర్ను జ్యూస్లో కలిపారు. పిల్లల్ని పిలిచి తాగమని చెప్పారు. విషయం తెలియక వాళ్లు తాగి వెంటనే పడిపోయారు. తోటి విద్యార్థులు విషయాన్ని వార్డెన్కు చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా మద్యం తాగినట్లు తేలింది. మొత్తం ఘటనపై ఆరా తీస్తే హాస్టల్ సిబ్బంది నిర్వాకం బయటపడింది. వార్డెన్ వెంటనే విషయాన్ని బీసీ సంక్షేమశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకొని విచారణ చేపట్టారు. సిబ్బందిని నిలదీయగా... చేసిన తప్పును ఒప్పుకున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు







