భారీ వర్షాల కారణంగా మూతబడ్డ స్కూళ్ళు
- November 01, 2017
తమిళనాడులో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని స్కూళ్ళు , కాలేజీలు మూతపడ్డాయి. గత రెండు సంవత్సరాల క్రితం వర్షబీభత్సం మిగిల్చిన విషాదం ఇంకా మరువక ముందే మరోసారి కుండపోత వర్షాలతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఈశాన్య రుతపవనాలకు తోడు అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి బాలచంద్రన్ తెలిపారు. తంజావూరు జిల్లాతోపాటు చెన్నై, ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తంజావూరు జిల్లా తిన్నయూర్లోని వొరతనడుకు సమీపంలో భారీ వర్షం ధాటికి ఓ ఇంటి గోడ కుప్పకూలింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. భారీ వర్షాలతో రోడ్లన్నీ నీటిలో నిండిపోవడంతో సెలవులను ప్రకటించారు . లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఏర్పడింది. తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొ న్నారు. చైన్నైలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇళ్ళలోకి వర్షపు నీరు చేరింది. 2015 నాటి వరదల పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదమున్నందున పౌర సేవలను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







