ముంబై లో సొంత ఇల్లు తీసుకున్న కుమారి 21ఎఫ్
- November 02, 2017
అలా ఎలా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన హెబ్బా పటేల్.. కుమారిగా యువతను ఆకట్టుకొన్నది. హెబ్బా పటేల్ తాజా సినిమా ఏంజిల్ నవంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపద్యంలో హెబ్బా మీడియా తో మాట్లాడుతూ.. తన కొత్త సినిమా ఏంజిల్ గురించి.. తన సినీ కెరీర్ గురించి అనేక విషయాలను పంచుకొన్నది.
కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత టైటిల్ రోల్ పోషించిన సినిమా ఏంజిల్ అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంతో కష్టపడ్డాం.. అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో తాను దేవ కన్యలా కనిపించనున్నట్లు తెలిపింది.. దేవలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాను..? హీరో ని ఎందుకు కలిశాను వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి అని చెప్పింది. అంతేకాదు.. తాను ముంబై లో ఓ ఇల్లును కొనుక్కొన్నట్లు.. ఆ ఇంటి పనులు చూసుకుంటున్నట్లు చెప్పింది.. నా సినీ కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా.. గత కొంత కాలంగా ఖాళీలేకుండా నటిస్తున్నా.. అందుకని కొంత కాలం విరామం తీసుకొని.. ఆపై కొత్త సినిమాలను అంగీకరించాలను కొంటున్నట్లు చెప్పింది.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం