వివాదంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ

- November 02, 2017 , by Maagulf
వివాదంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. ఢిల్లీ టీ ట్వంటీలో కోహ్లీ వాకీటాకీ ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఐసిసి నిబంధనలకు విరుధ్ధంగా ఓ ఆటగాడ ఫోన్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు మ్యాచ్ సమయంలో వాడకూడదు. అయితే భారత్ ఇన్నింగ్స్ కొనసాగుతుండగా.. డగౌట్‌లో కోహ్లీ వాకీటాకీలో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో కోహ్లీ తీరుపై విమర్శలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఐసిసి కోహ్లీకి క్లీన్‌చిట్ ఇచ్చింది. వాకీటాకీ మాట్లాడడానికి భారత కెప్టెన్ అనుమతి తీసుకున్నట్టు వెల్లడించింది. దీనిపై మరికాసేపట్లో ఐసిసి అధికారిక ప్రకటన విడుదల చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com