ముంబై లో సొంత ఇల్లు తీసుకున్న కుమారి 21ఎఫ్
- November 02, 2017
అలా ఎలా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన హెబ్బా పటేల్.. కుమారిగా యువతను ఆకట్టుకొన్నది. హెబ్బా పటేల్ తాజా సినిమా ఏంజిల్ నవంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపద్యంలో హెబ్బా మీడియా తో మాట్లాడుతూ.. తన కొత్త సినిమా ఏంజిల్ గురించి.. తన సినీ కెరీర్ గురించి అనేక విషయాలను పంచుకొన్నది.
కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత టైటిల్ రోల్ పోషించిన సినిమా ఏంజిల్ అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంతో కష్టపడ్డాం.. అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో తాను దేవ కన్యలా కనిపించనున్నట్లు తెలిపింది.. దేవలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాను..? హీరో ని ఎందుకు కలిశాను వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి అని చెప్పింది. అంతేకాదు.. తాను ముంబై లో ఓ ఇల్లును కొనుక్కొన్నట్లు.. ఆ ఇంటి పనులు చూసుకుంటున్నట్లు చెప్పింది.. నా సినీ కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా.. గత కొంత కాలంగా ఖాళీలేకుండా నటిస్తున్నా.. అందుకని కొంత కాలం విరామం తీసుకొని.. ఆపై కొత్త సినిమాలను అంగీకరించాలను కొంటున్నట్లు చెప్పింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: Gautam Gambhir changes handshake protocol after Pakistan match
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!