ముంబై లో సొంత ఇల్లు తీసుకున్న కుమారి 21ఎఫ్
- November 02, 2017
అలా ఎలా అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించిన హెబ్బా పటేల్.. కుమారిగా యువతను ఆకట్టుకొన్నది. హెబ్బా పటేల్ తాజా సినిమా ఏంజిల్ నవంబర్ 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ నేపద్యంలో హెబ్బా మీడియా తో మాట్లాడుతూ.. తన కొత్త సినిమా ఏంజిల్ గురించి.. తన సినీ కెరీర్ గురించి అనేక విషయాలను పంచుకొన్నది.
కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత టైటిల్ రోల్ పోషించిన సినిమా ఏంజిల్ అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎంతో కష్టపడ్డాం.. అని చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాలో తాను దేవ కన్యలా కనిపించనున్నట్లు తెలిపింది.. దేవలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చాను..? హీరో ని ఎందుకు కలిశాను వంటి అంశాలు చాలా ఆసక్తిగా ఉంటాయి అని చెప్పింది. అంతేకాదు.. తాను ముంబై లో ఓ ఇల్లును కొనుక్కొన్నట్లు.. ఆ ఇంటి పనులు చూసుకుంటున్నట్లు చెప్పింది.. నా సినీ కెరీర్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా.. గత కొంత కాలంగా ఖాళీలేకుండా నటిస్తున్నా.. అందుకని కొంత కాలం విరామం తీసుకొని.. ఆపై కొత్త సినిమాలను అంగీకరించాలను కొంటున్నట్లు చెప్పింది.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









