ప్రభుత్వ రంగ రవాణా సంస్థ గ్రీన్ బాండ్లు జారీ
- November 08, 2015
పర్యావరణరహిత ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు భారత రైల్వేశాఖ గ్రీన్ బాండ్లను జారీ చేయనుంది. ప్రభుత్వ రంగ రవాణా సంస్థ గ్రీన్ బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి కానుంది. దీనిపై రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... గ్రీన్ బాండ్లపై కసరత్తు జరుగుతోందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. సంప్రదాయ ఇంధన వాడకాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రైల్వే శాఖ సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయతలపెట్టినట్టు గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం రైళ్లు, రైల్వే స్టేషన్ల పైభాగంలోనూ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని బోగీలు, రైల్వే ఫ్లాట్ఫాంలు సోలార్ విద్యుత్ ఆధారంగా నడుస్తున్నాయి. రైల్వే శాఖ అభివృద్ధి పనుల కోసం కేంద్ర సాయంపై ఆధారపడకుండా నిధులు సేకరించేందుకు ఇతర మార్గాలను అన్వేషించే చర్యల్లో భాగంగా ఈ గ్రీన్ బాండ్లను జారీ చేయనుంది.
తాజా వార్తలు
- ఖతార్, ఒమన్ మధ్య బలపడుతున్న స్నేహబంధం..
- మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- ‘దుబాయ్-ఇట్ అవార్డు’కు ఆగస్టు 10 నుంచి నామినేషన్లు
- బ్రహ్మోస్కు భారీ డిమాండ్..
- వరంగల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సీవీ ఆనంద్ భేటీ
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







