ప్రభుత్వ రంగ రవాణా సంస్థ గ్రీన్ బాండ్లు జారీ
- November 08, 2015పర్యావరణరహిత ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన నిధులను సేకరించేందుకు భారత రైల్వేశాఖ గ్రీన్ బాండ్లను జారీ చేయనుంది. ప్రభుత్వ రంగ రవాణా సంస్థ గ్రీన్ బాండ్లను జారీ చేయడం ఇదే తొలిసారి కానుంది. దీనిపై రైల్వేశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... గ్రీన్ బాండ్లపై కసరత్తు జరుగుతోందని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. సంప్రదాయ ఇంధన వాడకాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా రైల్వే శాఖ సోలార్, పవన విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయతలపెట్టినట్టు గుర్తు చేశారు. విద్యుత్ ఉత్పత్తి కోసం రైళ్లు, రైల్వే స్టేషన్ల పైభాగంలోనూ సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని బోగీలు, రైల్వే ఫ్లాట్ఫాంలు సోలార్ విద్యుత్ ఆధారంగా నడుస్తున్నాయి. రైల్వే శాఖ అభివృద్ధి పనుల కోసం కేంద్ర సాయంపై ఆధారపడకుండా నిధులు సేకరించేందుకు ఇతర మార్గాలను అన్వేషించే చర్యల్లో భాగంగా ఈ గ్రీన్ బాండ్లను జారీ చేయనుంది.
తాజా వార్తలు
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..