రియాద్పైకి దూసుకొచ్చిన క్షిపణి
- November 04, 2017కల్లోలిత యెమన్ నుంచి దేశ రాజధాని రియాద్పైకి దూసుకొచ్చిన క్షిపణిని సౌదీ అరేబియా నేల కూల్చింది. దీంతో కూలిన క్షిపణికి చెందిన శకలాలు రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేల కూలాయి. ఈ మేరకు సౌదీ అరేబియా అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ మద్దతు కలిగిన షితే హుతి రెబెల్స్(షియా-సున్నీలు ఏర్పరచిన మతపరమైన రాజకీయ శ్రేణులు).. తామే ఈ దాడికి పాల్పడినట్లు ప్రకటించుకుంది.
రియాద్పైకి వస్తున్న క్షిపణిని కూల్చేయడంతో కింగ్ ఖలీద్ అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఆవరణంలో భారీ పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. భారీ ప్రాణం నష్టం కల్గేలా.. జనావాస ప్రాంతాలను టార్గెట్గా చేసుకుని మిస్సైల్ దాడి జరిగిందని సౌదీ అధికారులు పేర్కొన్నారు. 1,200 కిలోమీటర్ల దూరం నుంచి ఈ మిస్సైల్ను ప్రయోగించినట్లు చెప్పారు. ఈ ఏడాది జులైలో కూడా యెమెన్ నుంచి సౌదీలోని మక్కా ప్రాంతంపై క్షిపణి దాడి జరిగింది. దీన్ని కూడా సౌదీ రక్షణ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయి.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్