చైనాకు కౌంటర్‌గా భారత్ 17 టన్నెల్స్ నిర్మాణం

- November 06, 2017 , by Maagulf
చైనాకు కౌంటర్‌గా భారత్ 17 టన్నెల్స్ నిర్మాణం

చైనాకు కౌంటర్ ఇచ్చే చర్యలను భారత్ ముమ్మరం చేసింది. భారత్ - చైనా సరిహద్దు వెంబడి 17 హైవే టన్నెల్స్ నిర్మాణానికి నడుం బిగించింది.
ఇండియా - చైనా 
ఇండియా - చైనా బోర్డర్ రోడ్స్
సరిహద్దుల్లో ఇప్పటికే చేపట్టిన ఇండియా - చైనా బోర్డర్ రోడ్స్ (ఐసీబీఆర్)కు అదనంగా వీటిని నిర్మించాలని యోచిస్తోంది. మంచు విపరీతంగా కురిసే సమయంలో రోడ్లు మూసుకుపోవడంతో లాజిస్టిక్స్ సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోంది.

నివారణకు 
డొక్లాంతో సంబంధాలు నిలిచిపోనున్నాయి, నివారణకు
ముఖ్యంగా వ్యూహాత్మక ప్రదేశమైన డొక్లాంతో సంబంధాలు నిలిచిపోతున్నాయి. దీనిని నివారించి ఆర్మీకి నిత్యం రవాణా అందుబాటులో ఉండేందుకు వీటి నిర్మాణానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. టన్నెల్స్ నిర్మిస్తే మంచు కురిసినా ఇబ్బంది ఉండదు.

టన్నెల్స్ 
టన్నెల్స్ నిర్మాణంతో
టన్నెల్స్ నిర్మాణంతో నిర్వహణ వ్యయం కూడా విపరీతంగా తగ్గుతుందని బోర్డర్స్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రెండు రోజుల సమినార్‌లో పేర్కొన్నారు.

దూకుడు 
చైనా సరిహద్దుల్లో దూకుడు
కాగా, ఇటీవల చైనా సరిహద్దుల్లో దూకుడుగా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. డొక్లామ్ ఇష్యూ, బ్రహ్మపుత్ర నదీ జలాలు తరలించేందుకు సొరంగం, రోడ్డు నిర్మాణాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com