దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ సఫారీ టిక్కెట్ల ధర ఎంతంటే!
- November 07, 2017
దుబాయ్ సఫారీ, దుబాయ్ ఫ్రేమ్ ఎంట్రీ టిక్కెట్ ధరల్ని ప్రకటించారు. దుబాయ్ ఫ్రేమ్లోకి ఎంట్రీ టిక్కెట్ ధర పెద్దలకు 50 దిర్హామ్లు కాగా, పిల్లలకు 30 దిర్హామ్లుగా నిర్ణయించడం జరిగింది. దుబాయ్ సఫారీకి మాత్రం పెద్దలు 50 నుంచి 85 దిర్హామ్లు చెల్లించాల్సి ఉండగా, పిల్లలు 20 నుంచి 30 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ సఫారీలో ఎంచుకున్న ఎంటర్టైన్మెంట్ని బట్టి ఈ ధరలు ఉంటాయి. మూడేళ్ళ లోపు వయసున్న చిన్నారులకు దుబాయ్ సఫారీలోకి ప్రవేశం ఉచితం. దుబాయ్ ఫ్రేమ్లోకి వెళ్ళేందుకు సందర్శకులకి పేపర్లెస్ టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇ-టిక్కెట్స్ ఈ రెండిటికీ వర్తిస్తాయి. యాప్ ద్వారా ఇ-పేమెంట్ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 160 మిలియన్ దిర్హామ్లతో దుబాయ్ ఫ్రేమ్ని 150 మీటర్ల ఎత్తు, 93 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఒక్క నిమిషంలో ఎలివేట్ రైడ్ ద్వారా టాప్కి చేరుకుని ఓల్డ్ మరియు న్యూ దుబాయ్ని వీక్షించవచ్చు. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో రూపొందించిన సఫారీ పార్క్లో 5,000కి పైగా జంతువులు, ఇతర జీవులు సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. అల్ వర్కా5లో 119 హెక్టార్లలో దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









