దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ సఫారీ టిక్కెట్ల ధర ఎంతంటే!
- November 07, 2017దుబాయ్ సఫారీ, దుబాయ్ ఫ్రేమ్ ఎంట్రీ టిక్కెట్ ధరల్ని ప్రకటించారు. దుబాయ్ ఫ్రేమ్లోకి ఎంట్రీ టిక్కెట్ ధర పెద్దలకు 50 దిర్హామ్లు కాగా, పిల్లలకు 30 దిర్హామ్లుగా నిర్ణయించడం జరిగింది. దుబాయ్ సఫారీకి మాత్రం పెద్దలు 50 నుంచి 85 దిర్హామ్లు చెల్లించాల్సి ఉండగా, పిల్లలు 20 నుంచి 30 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ సఫారీలో ఎంచుకున్న ఎంటర్టైన్మెంట్ని బట్టి ఈ ధరలు ఉంటాయి. మూడేళ్ళ లోపు వయసున్న చిన్నారులకు దుబాయ్ సఫారీలోకి ప్రవేశం ఉచితం. దుబాయ్ ఫ్రేమ్లోకి వెళ్ళేందుకు సందర్శకులకి పేపర్లెస్ టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇ-టిక్కెట్స్ ఈ రెండిటికీ వర్తిస్తాయి. యాప్ ద్వారా ఇ-పేమెంట్ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 160 మిలియన్ దిర్హామ్లతో దుబాయ్ ఫ్రేమ్ని 150 మీటర్ల ఎత్తు, 93 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఒక్క నిమిషంలో ఎలివేట్ రైడ్ ద్వారా టాప్కి చేరుకుని ఓల్డ్ మరియు న్యూ దుబాయ్ని వీక్షించవచ్చు. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో రూపొందించిన సఫారీ పార్క్లో 5,000కి పైగా జంతువులు, ఇతర జీవులు సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. అల్ వర్కా5లో 119 హెక్టార్లలో దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్