దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ సఫారీ టిక్కెట్ల ధర ఎంతంటే!
- November 07, 2017
దుబాయ్ సఫారీ, దుబాయ్ ఫ్రేమ్ ఎంట్రీ టిక్కెట్ ధరల్ని ప్రకటించారు. దుబాయ్ ఫ్రేమ్లోకి ఎంట్రీ టిక్కెట్ ధర పెద్దలకు 50 దిర్హామ్లు కాగా, పిల్లలకు 30 దిర్హామ్లుగా నిర్ణయించడం జరిగింది. దుబాయ్ సఫారీకి మాత్రం పెద్దలు 50 నుంచి 85 దిర్హామ్లు చెల్లించాల్సి ఉండగా, పిల్లలు 20 నుంచి 30 దిర్హామ్లు చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ సఫారీలో ఎంచుకున్న ఎంటర్టైన్మెంట్ని బట్టి ఈ ధరలు ఉంటాయి. మూడేళ్ళ లోపు వయసున్న చిన్నారులకు దుబాయ్ సఫారీలోకి ప్రవేశం ఉచితం. దుబాయ్ ఫ్రేమ్లోకి వెళ్ళేందుకు సందర్శకులకి పేపర్లెస్ టిక్కెట్లను అందుబాటులోకి తెస్తున్నారు. ఇ-టిక్కెట్స్ ఈ రెండిటికీ వర్తిస్తాయి. యాప్ ద్వారా ఇ-పేమెంట్ విధానంలో టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. 160 మిలియన్ దిర్హామ్లతో దుబాయ్ ఫ్రేమ్ని 150 మీటర్ల ఎత్తు, 93 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఒక్క నిమిషంలో ఎలివేట్ రైడ్ ద్వారా టాప్కి చేరుకుని ఓల్డ్ మరియు న్యూ దుబాయ్ని వీక్షించవచ్చు. 1 బిలియన్ దిర్హామ్ ఖర్చుతో రూపొందించిన సఫారీ పార్క్లో 5,000కి పైగా జంతువులు, ఇతర జీవులు సందర్శకుల్ని ఆకట్టుకోనున్నాయి. అల్ వర్కా5లో 119 హెక్టార్లలో దీన్ని రూపొందించారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







