ముగ్గురు యువతులతో వ్యభిచారం: తల్లి, కుమార్తెపై కేసుల నమోదు
- November 07, 2017
ఇరాకీ హౌస్ వైఫ్, ఆమె తల్లి ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసులు నమోదయ్యాయి. 15, నుంచి 17 ఏళ్ళ వయసున్న ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు 31 ఏళ్ళ గృహిణి ఆమె తల్లి (వయసు 64) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ముందర ఈ కేసు విచారణకు వచ్చింది. 2013లో బలవంతంగా తనను ఈ మురికి కూపంలోకి తీసుకొచ్చారని ఓ బాధితురాలు పేర్కొంది. తనతోపాటు తన సోదరిని కూడా వ్యభిచారంలోకి లాగారని ఆమె వివరించింది. తనతో బలవంతంగా సంతకాలు చేయించుకుని ఈ వ్యభిచారంలోకి దించినట్లు మూడో బాధితురాలు చెప్పింది. 31ఏళ్ళ నిందితురాలి భర్త, బాధితుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకు తరలిస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల్ని దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్కి తరలించారు. కేసు తదుపరి విచారణ నవంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







