ముగ్గురు యువతులతో వ్యభిచారం: తల్లి, కుమార్తెపై కేసుల నమోదు

- November 07, 2017 , by Maagulf
ముగ్గురు యువతులతో వ్యభిచారం: తల్లి, కుమార్తెపై కేసుల నమోదు

ఇరాకీ హౌస్‌ వైఫ్‌, ఆమె తల్లి ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసులు నమోదయ్యాయి. 15, నుంచి 17 ఏళ్ళ వయసున్న ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు 31 ఏళ్ళ గృహిణి ఆమె తల్లి (వయసు 64) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దుబాయ్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ ఇన్‌స్టాన్స్‌ ముందర ఈ కేసు విచారణకు వచ్చింది. 2013లో బలవంతంగా తనను ఈ మురికి కూపంలోకి తీసుకొచ్చారని ఓ బాధితురాలు పేర్కొంది. తనతోపాటు తన సోదరిని కూడా వ్యభిచారంలోకి లాగారని ఆమె వివరించింది. తనతో బలవంతంగా సంతకాలు చేయించుకుని ఈ వ్యభిచారంలోకి దించినట్లు మూడో బాధితురాలు చెప్పింది. 31ఏళ్ళ నిందితురాలి భర్త, బాధితుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకు తరలిస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల్ని దుబాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ విమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌కి తరలించారు. కేసు తదుపరి విచారణ నవంబర్‌ 28వ తేదీకి వాయిదా పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com