ముగ్గురు యువతులతో వ్యభిచారం: తల్లి, కుమార్తెపై కేసుల నమోదు
- November 07, 2017
ఇరాకీ హౌస్ వైఫ్, ఆమె తల్లి ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో వారిపై కేసులు నమోదయ్యాయి. 15, నుంచి 17 ఏళ్ళ వయసున్న ముగ్గురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు 31 ఏళ్ళ గృహిణి ఆమె తల్లి (వయసు 64) ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ ముందర ఈ కేసు విచారణకు వచ్చింది. 2013లో బలవంతంగా తనను ఈ మురికి కూపంలోకి తీసుకొచ్చారని ఓ బాధితురాలు పేర్కొంది. తనతోపాటు తన సోదరిని కూడా వ్యభిచారంలోకి లాగారని ఆమె వివరించింది. తనతో బలవంతంగా సంతకాలు చేయించుకుని ఈ వ్యభిచారంలోకి దించినట్లు మూడో బాధితురాలు చెప్పింది. 31ఏళ్ళ నిందితురాలి భర్త, బాధితుల్ని ఒక చోట నుంచి ఇంకో చోటకు తరలిస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. బాధితుల్ని దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్కి తరలించారు. కేసు తదుపరి విచారణ నవంబర్ 28వ తేదీకి వాయిదా పడింది.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







