ఖసబ్లో తొలి యాంఫిబియస్ టూరిస్ట్ బస్ ప్రారంభం
- November 08, 2017ఖసబ్లో పర్యటించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు యాంఫిబియస్ బస్ సర్వీస్ని ప్రారంభించారు. గోల్డెన్ కోస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ ఈ బస్ని ప్రారంభించింది. తొలిసారిగా ఈ సర్వీస్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. గోల్డెన్ కోస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ జిఎం అబ్దుల్ రెహ్మాన్ అహ్మద్ అల్ముల్లా మాట్లాడుతూ, యూరోప్ నుంచి ఈ బస్ని ఇంపోర్ట్ చేశామని అక్టోబర్ 30 నుంచి ఇది అందుబాటులోకి వచ్చిందని అన్నారు. 90 నిమిషాలపాటు ఈ బస్ ప్రయాణం ఉంటుంది. ఈ బస్ నేల మీదా, సముద్రంలోనూ ప్రయాణిస్తుంది. 34 సీట్లు కెపాసిటీతో ఉండే ఈ బస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపైనా, నీటిలో 7 నాట్స్ వేగంతోనూ ప్రయాణించగలదు. పెద్దలకు 10 ఒమన్ రియాల్స్, పిల్లలకు 5 ఒమన్ రియాల్స్ ఛార్జ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. లైఫ్ జాకెట్స్, మెడికల్ ఎక్విప్మెంట్, క్వాలిఫైడ్ టెక్నికల్ స్టాఫ్ ఈ బస్లో అందుబాటులో ఉంటారు. ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చెయ్యడానికి రెండేళ్ళు పట్టింది.
తాజా వార్తలు
- నర్సింగ్ సిబ్బందికి స్పెషల్ అలవెన్స్
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి