జనసేన అధినేత పవన్ మనకి ఎన్టీఆర్.. కమల్ వారికి ఎంజీఆర్ అంటున్న నరేష్
- November 09, 2017
సినిమా బ్యాక్ గ్రౌండ్నుంచి వచ్చినా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుని తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరి హీరోల్లా కాకుండా విభిన్నమైన మనస్తత్వంతో ఉంటాడు. తనలో ఏదో ప్రత్యేకత ఉందనే విషయంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఆలోచింపజేస్తుంటాడు. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జనసేన పార్టీని కూడా స్థాపించాడు. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాల్నీ బ్యాలెన్స్ చేస్తూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఎప్పడూ టచ్లోనే ఉంటారు. ఆ విధంగా పవన్ ట్విట్టర్ అభిమానుల సంఖ్య రెండు మిలియన్లదాకా చేరుకుంది. ట్విట్టర్ వేదికగానే ఆయన ప్రశ్నల పరంపర కొనసాగుతుంటుంది.
ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్ కూడా పవన్ అభిమాని అన్న విషయం చెప్పకనే చెబుతుంది ఈ ట్వీట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్, తమిళనాడు రాష్ట్రానికి కమల్ హాసన్ ముఖ్యమంత్రులు కావాలని లక్షలాది మంది అభిమానులు కలలుగంటున్నారని ట్విట్టర్లో పేర్కొనడమే కాకుండా పవన్ ముఖ్యమంత్రి అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు పాలన వస్తుందని, కమల్ హాసన్ తమిళనాడుకు ముఖ్యమంత్రి అయితే ఎంజీఆర్ పాలన వస్తుందని అభిప్రాయపడ్డారు. నరేష్ ట్వీట్కి అభిమానులు కూడా పాజిటివ్గా రెస్పాండవుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









