జనసేన అధినేత పవన్ మనకి ఎన్టీఆర్.. కమల్ వారికి ఎంజీఆర్ అంటున్న నరేష్
- November 09, 2017
సినిమా బ్యాక్ గ్రౌండ్నుంచి వచ్చినా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకుని తనకంటూ ఓ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అందరి హీరోల్లా కాకుండా విభిన్నమైన మనస్తత్వంతో ఉంటాడు. తనలో ఏదో ప్రత్యేకత ఉందనే విషయంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఆలోచింపజేస్తుంటాడు. ప్రశ్నించేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జనసేన పార్టీని కూడా స్థాపించాడు. ఓ వైపు సినిమాలు, మరో వైపు రాజకీయాల్నీ బ్యాలెన్స్ చేస్తూ ట్విట్టర్ వేదికగా అభిమానులతో ఎప్పడూ టచ్లోనే ఉంటారు. ఆ విధంగా పవన్ ట్విట్టర్ అభిమానుల సంఖ్య రెండు మిలియన్లదాకా చేరుకుంది. ట్విట్టర్ వేదికగానే ఆయన ప్రశ్నల పరంపర కొనసాగుతుంటుంది.
ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు నరేష్ కూడా పవన్ అభిమాని అన్న విషయం చెప్పకనే చెబుతుంది ఈ ట్వీట్.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్, తమిళనాడు రాష్ట్రానికి కమల్ హాసన్ ముఖ్యమంత్రులు కావాలని లక్షలాది మంది అభిమానులు కలలుగంటున్నారని ట్విట్టర్లో పేర్కొనడమే కాకుండా పవన్ ముఖ్యమంత్రి అయితే స్వర్గీయ నందమూరి తారక రామారావు పాలన వస్తుందని, కమల్ హాసన్ తమిళనాడుకు ముఖ్యమంత్రి అయితే ఎంజీఆర్ పాలన వస్తుందని అభిప్రాయపడ్డారు. నరేష్ ట్వీట్కి అభిమానులు కూడా పాజిటివ్గా రెస్పాండవుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







