'ఒక్కడు మిగిలాడు' లో హీరో ఎంట్రీ ఎక్కడ?
- November 09, 2017
మనది హీరోల చుట్టూ తిరిగే ఇండస్ట్రీ. మన సినిమాలు కూడా అలాగే నడుస్తాయి. సినిమా స్క్రీన్ టైంలో కనీసం 80 శాతం హీరో కనిపించాలి. ప్రతి సన్నివేశంలోనూ హీరో ఉండాలి. లేకపోతే హీరో ప్రస్తావన అయినా ఉండాలి. అంతగా హీరోకు ప్రాధాన్యం ఇస్తారు మన దర్శకులు. ఐతే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మంచు మనోజ్ సినిమా 'ఒక్కడు మిగిలాడు'లో మాత్రం హీరో 40 నిమిషాల పాటు కనిపించడట.
ఈ చిత్ర ద్వితీయార్ధంలో తన పాత్ర 40 నిమిషాల పాటు ఉండదని మనోజే స్వయంగా వెల్లడించాడు. మరి దర్శకుడు అజయ్ నూతక్కి ఇంత పెద్ద సాహసం చేయడం.. మనోజ్ అందుకు అంగీకరించడం విశేషం.
శ్రీలంకలో తమిళుల కష్టాల నేపథ్యంలో సాగే సినిమా 'ఒక్కడు మిగిలాడు'. ఇందులో మనోజ్తో పాటు దర్శకుడు అజయ్ కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ద్వితీయార్దంలో అతడి పాత్రే హైలైట్ అవుతుందట. సముద్రం నేపథ్యంలో సాగే ఒక ఎపిసోడ్ సినిమాకు ఆయువు పట్టు అని చెబుతున్నారు. ఆ ఎపిసోడ్ మొత్తంలో మనోజ్ కనిపించడట. మరి మనోజ్ చేసిన ఈ రిస్క్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో..
ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. మనోజ్ ఇందులో ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ స్ఫూర్తితో తీర్చిదిద్దన ఒక పాత్రను.. ఒక స్టూడెంట్ లీడర్ పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమా కోసం పడ్డ కష్టం.. కెరీర్లో ఇంతకుముందెన్నడూ పడలేదని మనోజ్ అంటున్నాడు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







