సౌదీ కింగ్ మరో కీలక నిర్ణయం
- November 09, 2017
సౌదీ కింగ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం సౌదీ కింగ్ కొత్తగా 30 మంది జడ్జీలను నియమించడంతో పాటు 26 మందిని ప్రమోట్ చేసినట్టు సౌదీ అరేబియా స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఎస్పీఏ రిపోర్టు చేసింది. అవినీతి కేసులో 11 మంది యువరాజులను, నలుగురు మంత్రులను, డజన్ల కొద్దీ మాజీ మంత్రులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ నియామకం, ప్రమోషన్లు చర్చనీయాంశమైంది. సల్మాన్ ఆదేశాలతోనే వీరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్, లంచం, వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దోచుకోవడం, దోపిడీ చేయడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
26 మంది జడ్జీలను ప్రమోట్ చేస్తున్నట్టు మరో 30 మందిని జ్యుడీషియరీలో వివిధ స్థానాల్లో నియమిస్తున్నట్టు సౌదీ రాజు రాయల్ ఆర్డర్ జారీచేశారు. అదుపులోకి తీసుకున్న వారి బ్యాంకుల సమాచారం అందించాలని యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రెగ్యులేటర్స్ ఇప్పటికే ఆదేశించాయి. వీలైతే వీరి అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయాలని పేర్కొన్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆదేశాల మేరకు 1700 దేశీయ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశామని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







