అమెరికా క్లీవ్ ల్యాండ్ లో బాస్కెట్ బాల్ మ్యాచ్లో కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శన
- November 09, 2017
ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానాకు మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికా క్లీవ్ ల్యాండ్ లో.. నేషనల్ బాస్కెట్ బాల్ అకాడమీ మ్యాచ్ సందర్భంగా తెలుగు సంస్కృతి ,తెలుగు సాంప్రదాయాలను పరిచయం చేసే గొప్ప అవకాశం తానాకు లభించింది. క్లీవ్ లాండ్ కావలిఎర్స్, ఇండియానా పిసర్స్ మ్యాచ్ సందర్భంగా.. తానా ప్రతినిధులతోపాటు.. చిన్నారులందరినీ వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమెరికా.. ఇండియాలో తానా చేపడుతున్న సేవాకార్యక్రమలను వారు ప్రశంసించారు.
అనంతరం 30 వేల మంది ఆడియన్స్ సమక్షంలో 7 నిముషాల పాటు చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమెరికా చరిత్రలో మరే తెలుగు సంస్థకు ఈ అవకాశం దక్కలేదని.. తానా జాయింట్ ట్రెజరర్ అశోక్ కొల్ల అన్నారు. తానా ఆధ్వర్యంలో జరిగిన ఈ గేమ్ ను ఇండియన్ హెరిటేజ్ కమ్యూనిటీ నైట్ గా గుర్తించారని తెలిపారు. ఈ అరుదైన అకాశం రావడానికి కృషి చేసిన వారిని తానా ప్రెసిడెంట్ ఎలక్ట్ జయ తాళ్లూరి అభినందించారు. భవిష్యత్ లో ఇలాంటివి మరిన్ని చేపడతామని తానా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు అన్నారు. ఈ కార్యక్రమంలో డెట్రాయిట్ , కొలంబస్, క్లీవ్ లాండ్ తానా రీజనల్ కొ ఆర్డినేటర్లు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







