కాలుష్యం కారణంగా అస్తవ్యస్తంగా మారిన రవాణా వ్యవస్థ
- November 12, 2017
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన న్యూఢిల్లీలో కాలుష్యం శాతం పెరుగుతోంది. అంతేకాదు, ఢిల్లీలో కాలుష్యం స్థాయిని తెలుపుతూ ప్రపంచ పర్యావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసిన విషయం విధితమే. ఇప్పుడు ఇదే విషయం దేశమంతటా చర్చనీయాంశమైంది. దీంతో మేల్కొన్న ప్రభుత్వం కాలుష్య నివారణకు ఇప్పుడిప్పుడే చర్యలను ముమ్మరం చేసింది కూడాను.
అయితే, తాజా సమాచారం మేరకు ఢిల్లీలో కాలుష్యం ప్రభావం కారణంగా 34 రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. అంతేకాక 21 రైళ్ల సమయాల్లో మార్పు, ఎనిమిది రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు ఉన్నతాధికారులు.
అయితే, గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి పెరిగిపోవడంతో తమ కార్యాలయాలకు వెళ్లాల్సిన ప్రజలకు కాలుష్యంతో కూడిన పొగమంచు దుప్పటిలా కప్పబడటం వల్ల రోడ్లపై వచ్చే వారు కూడా సరిగా కనిపించలేదు. పశ్చిమ ఢిల్లీలో గాలి కలుషితమై ఆందోళనకరంగా మారింది. ఇదే కాలుష్యం మరో మూడు రోజులు కొనసాగితే, పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించే యోచనలో ఉంది ప్రభుత్వం.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం