ట్రావెల్ ఏజెన్సీలో దొంగతనం: 12 మందికి ట్రయల్
- November 14, 201712 మంది సభ్యులు గల ముఠాని దొంగతనం కేసులో ట్రయల్ ముందుంచారు. కత్తులతో బెదిరించి, ట్రావెల్ ఆఫీసులో 14,000 దిర్హామ్లు దొంగిలించిన కేసులో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ఆసియాకి చెందిన వ్యక్తులు మొహానికి మాస్కులు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో సహా పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం ముసాఫ్ఫాలోని ఓ ట్రావెల్ ఆఫీసుపై దాడి చేసింది ఈ దొంగల ముఠా. దొంగతనంపై ఆ సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కొంత నగదు, అలాగే కొన్ని మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే నిందితులు తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నారు. తదుపరి విచారణ డిసెంబర్కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు