ఎమర్జన్సీ ల్యాండింగ్ - అయినా దక్కని ప్రాణం
- November 16, 2017
సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం, యూఏఈ క్యాపిటల్ అబుదాబీలో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న మొహమ్మద్ సలీమ్ అనే 35 ఏళ్ళ వ్యక్తికి గుండెపోటు రావడంతో, ఎమర్జన్సీ ల్యాండింగ్ అనంతరం అతన్ని ముఫ్రాక్ హాస్పిటల్కి తరలించారు. ఎమర్జన్సీ మెడికల్ కేర్ అందించినా, వైద్యులు అతని ప్రాణాన్ని కాపాడలేకపోయారు. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ఇండియాలోని కాలికట్ విమానాశ్రయానికి వెళ్ళవలసి ఉంది ఎమర్జన్సీ ల్యాండింగ్ అయిన విమానం. విమానం గాల్లో ఉండగానే ప్రయాణీకుడి పరిస్థితి విషమంగా మారిందనీ, దుబాయ్ తరలించాలనుకున్నా, పరిస్థితి ఇంకా క్షీణించడంతో అబుదాబీలో విమానాన్ని ల్యాండింగ్ చేసి, ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి తచేసిన తర్వాత మృతుడి బంధువులకు మృతదేహాన్ని అందజేస్తామని డ్యూటీ ఆఫీసర్ శ్రీశాంత్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







