ఎమర్జన్సీ ల్యాండింగ్ - అయినా దక్కని ప్రాణం
- November 16, 2017
సౌదీ అరేబియా నుంచి ఇండియాకి వెళుతున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం, యూఏఈ క్యాపిటల్ అబుదాబీలో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న మొహమ్మద్ సలీమ్ అనే 35 ఏళ్ళ వ్యక్తికి గుండెపోటు రావడంతో, ఎమర్జన్సీ ల్యాండింగ్ అనంతరం అతన్ని ముఫ్రాక్ హాస్పిటల్కి తరలించారు. ఎమర్జన్సీ మెడికల్ కేర్ అందించినా, వైద్యులు అతని ప్రాణాన్ని కాపాడలేకపోయారు. సౌదీ అరేబియాలోని రియాద్ నుంచి ఇండియాలోని కాలికట్ విమానాశ్రయానికి వెళ్ళవలసి ఉంది ఎమర్జన్సీ ల్యాండింగ్ అయిన విమానం. విమానం గాల్లో ఉండగానే ప్రయాణీకుడి పరిస్థితి విషమంగా మారిందనీ, దుబాయ్ తరలించాలనుకున్నా, పరిస్థితి ఇంకా క్షీణించడంతో అబుదాబీలో విమానాన్ని ల్యాండింగ్ చేసి, ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ పూర్తి తచేసిన తర్వాత మృతుడి బంధువులకు మృతదేహాన్ని అందజేస్తామని డ్యూటీ ఆఫీసర్ శ్రీశాంత్ చెప్పారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







