మూడు రోజుల పాటు బ్రిటన్ పర్యటనకు బయలుదేరిన మోడీ
- November 11, 2015
ప్రధాని నరేంద్రమోడీ గురువారం ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా మూడు రోజుల పాటు యునైటెడ్ కింగ్డమ్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. బ్రిటన్ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. అనంతరం బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్తో విస్తృత చర్చలు జరుపుతారు. ఈ పర్యటనలో పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. బ్రిటన్ పారిశ్రామిక వేత్తలతో మోడీ సమావేశమవుతారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని విజయవంతం చేయడమే ఈ పర్యటన లక్ష్యంగా ప్రధాని మోడీ అక్కడికి వెళ్లారు. ఈ పర్యటనలో ల్యాండ్ రోవర్ ప్లాంట్ను నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. టర్కీలో జరిగే జి-20 సదస్సుకు మోడీ హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









