రీషూట్ దిశగా కేరాఫ్ సూర్య
- November 18, 2017
ఓ సినిమా హిట్ కాకపోతే ... ఆ చిత్ర యూనిట్ అంతా నిరాశ చెందుతుంది. కొన్ని సార్లు నిర్మాతలకు లాస్ కూడా వస్తుంది. కానీ థియేటర్స్ లో సినిమా స్ర్కీనింగ్ మాత్రం ఉంటుంది. డైరెక్టర్ సుశీంద్రన్ ఇటీవల తెరకెక్కించిన తమిళ్ ఫిల్మ్ నెంజిల్ తునివిరుందాల్...తెలుగులో కేరాఫ్ సూర్య. ఇందులో హీరో సందీప్ కిషన్. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా రిలీజైంది. కానీ ఆశించిన స్థాయిలో సినిమా సక్సెస్ ట్రాక్ అందుకోలేదు. దీంతో డైరెక్టర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం థియేటర్స్ తో స్క్రీనింగ్ కి అనుమతి ఉన్న అన్ని థియేటర్స్ నుంచి ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు.
సందీప్ కిషన్, మెహరీన్ జంటగా నటించిన ఫిల్మ్ కేరాఫ్ సూర్య. రిలీజైన రోజు నుంచే సినిమాకు మంచి స్పందన రాలేదు. దీంతో డైరెక్టర్...హీరోయిన్ ఉన్న 20 నిమిషాల సీన్స్ ను కత్తెరించి మరి రిలీజ్ చేశారు. అయినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో డైరెక్టర్ ఇప్పుడు ఉపసంహరించుకొని...కొన్ని సీన్స్ రీషూట్ చేసి మళ్లీ రిలీజ్ చేసే పనిలో పడ్డాడట. హీరోయిన్ తో ఉన్న నిడివిని కట్ చేయడం...థియేటర్స్ ను సినిమా ఉపసంహరించుకోవడం అనేది కనీవినీ ఎరుగని సంగతి. బహుశ ఇదే ఫస్ట్ టైమ్ అనుకుంటా. కొత్త సీన్స్ యాడ్ చేసి మళ్లీ డిసెంబర్ 15న రిలీజ్ చేసి చీకట్లో ఉన్న సూర్యుడుని వెలుగులోకి తెస్తారట. మరి ఈ కొత్త సూర్య కిరణాలు ప్రేక్షకులని తాకుతాయో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!









